కోట్ల విలువైన భూమి..ప్రైవేటు సంస్థకు ధారాదత్తం

TG: కోట్ల విలువ చేసే భూమిని తక్కువ ఫీజుతో ఎన్ఎస్ ఇన్ఫ్రా కన్స్ట్రక్షన్స్ సంస్థకు లీజుకు కేటాయిస్తూ ప్రభుత్వం జీవో ఇవ్వడం కలకలంగా మారింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం దర్గా హుస్సేన్ షా వలి గ్రామంలో 1.04 ఎకరాల ఉర్దూ అకాడమీ భూమిని ఆ సంస్థకు 30 ఏళ్ల పాటు లీజుకు ఇస్తూ జీవో జారీ చేశారు. ఏడాదికి రూ.5,220 ఫీజుకే, ఎలాంటి పబ్లిక్ నోటీసులు లేకుండా ఇలా లీజు ఇవ్వడమేంటని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.



