అమరావతిని ఎవరూ కదిలించలేరు

AP: అమరావతి రాష్ట్ర ఖ్యాతిని పెంచేలా, యువతకు ఉపాధినిచ్చే కల్పవల్లిగా వర్ధిల్లుతుందని CM చంద్రబాబు అన్నారు. రాజధాని పరిధి వెంకటపాలెంలో నిర్వహించిన జగన్నాథ రథయాత్రలో పూరీ జగన్నాథుడికి ప్రత్యేక పూజలు చేశారు. హిందూ ధర్మానికి సాక్ష్యంగా నిర్మిస్తున్న అమరావతిని ఈ స్థల మహాత్మ్యంతో ఎవరూ కదిలించలేరు అన్నారు. సమాజంలో విలువలు, మానవ సంబంధాలు పడిపోతున్న టైంలో చాలా సమస్యలకు ఆధ్యాత్మికతే పరిష్కారం అని CM చంద్రబాబు అన్నారు.



