దెయ్యం వదిలిస్తామంటూ డబ్బులు వసూలు.. చివరికి

TG: మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం వెంగంపేట విలేజ్లో కేటుగాళ్ల గుట్టును గ్రామస్తులు రట్టు చేశారు. దెయ్యాలు-భూతాలు వదిలిస్తామంటూ బాబాల అవతారమెత్తి కొందరు భారీగా డబ్బులు దండుకుంటున్నారు. పూజల పేరుతో, దెయ్యాలను వదిలిస్తామంటూ గిరిజనుల నుంచి వేలాది రూపాయలు వసూలు చేశారు. గత కొన్ని రోజులుగా సాగుతున్న ఈ మోసాలను గమనించిన స్థానికులు ఏకమై వారిని నిలదీశారు.



