← Back to news

దేశంలో జరుగుతున్న అన్యాయాలపై స్పందించండి

By DK· 23 Jul 2026· హైదరాబాద్

నటి, నిర్మాత మంచు లక్ష్మి దేశంలో జరుగుతున్న సామాజిక, ప్రజా సమస్యలపై ప్రతి పౌరుడు బాధ్యతగా స్పందించాలని పిలుపునిచ్చారు. మనకెందుకులే అనే నిర్లక్ష్య ధోరణిని విడిచిపెట్టి, అన్యాయాలపై ప్రతి ఒక్కరూ తమ స్వరం వినిపించాలని కోరారు. రాజ్యాంగ హక్కుల కోసం ఆందోళన చేస్తున్న సోనమ్ వాంగ్‌చుక్‌కు మద్దతుగా ఆమె సోషల్ మీడియాలో వీడియో విడుదల చేశారు. సమస్యలపై మాట్లాడటం, చర్చించడం, స్పందించడం కూడా బాధ్యతాయుతమైన పౌరుడి కర్తవ్యమని పేర్కొన్నారు. దేశ భవిష్యత్తు, రాబోయే తరాల సంక్షేమం కోసం ప్రజలంతా చొరవ చూపాలన్నారు.

More in TG