← Back to news

గాంధీ సరోవర్‌కు కేంద్ర రక్షణశాఖ గ్రీన్ సిగ్నల్

By డీకే· 20 Jun 2026· Eenadu· హైదరాబాద్‌
గాంధీ సరోవర్‌కు కేంద్ర రక్షణశాఖ గ్రీన్ సిగ్నల్

తెలంగాణ గవర్నమెంట్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు 83ఎకరాల భూములిచ్చేందుకు రక్షణశాఖ అనుమతి ఇచ్చింది. వర్కింగ్ పర్మిషన్ ఇస్తూ ఉత్తర్వులు జారి చేసింది. రక్షణశాఖ డిసిషన్‌పై CM రేవంత్ రెడ్డి, కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు 'ఎక్స్' వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. మూసీ అభివృద్ధిలో కీలక మైలురాయిని చేరుకున్నామన్నారు. నిరంతరం మంచినీటి ప్రవాహంతో మూసీ నదికి పునరుజ్జీవం కల్పిస్తామని, పర్యావరణ, సాంస్కృతిక కేంద్రంగా తీర్చిదిద్దుతామని CM స్పష్టం చేశారు.

More in TG