← Back to news

ఆటో డ్రైవర్లను ఢీకొట్టిన చెత్త టిప్పర్

By DeeK· 15 Jun 2026· Ntnews· రంగారెడ్డి జిల్లా
ఆటో డ్రైవర్లను ఢీకొట్టిన చెత్త టిప్పర్

TG: రంగారెడ్డి జిల్లాలోని మందమల్లమ్మ చౌరస్తా చంద్రా గార్డెన్స్ వద్ద సంతోష్ (26) అనే ఆటోడ్రైవర్ ఆటో రిపేర్ వచ్చి ఆగిపోయింది. ఆటోను మెకానిక్ షాపునకు తీసుకెళ్లేందుకు తన ఫ్రెండ్స్ ప్రసాద్, సునీల్(33)లకు ఫోన్ చేశాడు. వారు మరో ఆటోలో అక్కడకు వచ్చారు. ఆటోకు తాడుతో కట్టి తరలించేందుకు సునీల్, ప్రసాద్ సిద్ధమయ్యారు. LBనగర్ వైపు నుంచి వచ్చిన GHMC చెత్త టిప్పర్ రోడ్డు పక్కనున్న ఆటోడ్రైవర్లను ఢీకొట్టింది. సంతోష్ స్పాట్‌లోనే మరణించాడు. గాయపడిన ఇద్దరిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ సునీల్ మృతి చెందాడు.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 1d ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.