కంకర రాళ్లకు బంగారు పూతతో మోసం

TG: నిజామాబాద్ హమాల్వాడీకి చెందిన రమేష్ దగ్గర శ్రీనివాస్ రూ.1.30 లక్షలు అప్పు తీసుకున్నాడు. డబ్బులు తిరిగి ఇవ్వాలని రమేష్ అడగడంతో, తనకు గుప్తనిధులు దొరికాయని శ్రీనివాస్ నమ్మించాడు. అప్పు కింద బంగారు రాళ్లు ఇస్తానని చెప్పి 'డిచ్పల్లి' దగ్గర ఉన్న ఘన్పూర్కు పిలిపించాడు. పైగా అదనంగా మరో రూ.32 వేలుతీసుకొని నాలుగు కుండల్లో నాలుగు రాళ్లు ఇచ్చాడు. తరువాత రమేష్ వాటిని చూసి అవి బంగారు రంగు వేసిన కంకర రాళ్లు అని గుర్తించాడు. తాను మోసపోయానని గ్రహించి డిచ్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.



