← Back to news

రోడ్లపై మురుగునీరు.. గుంతల్లో ప్రయాణం

By NANI M· 22 Aug 2026· Rowthulapudi, Rowthulapudi, Kakinada
రోడ్లపై మురుగునీరు.. గుంతల్లో ప్రయాణం

AP: కాకినాడ జిల్లా రౌతులపూడి గ్రామ పంచాయతీలో పారిశుధ్యం, రోడ్ల నిర్వహణపై స్థానికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలోని పలు ప్రాంతాల్లో చెత్త కుప్పలు పేరుకుపోవడం, డ్రైనేజీలు మూసుకుపోవడంతో మురుగునీరు రోడ్లపై ప్రవహించడం, రోడ్లు గుంతలమయంగా మారడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా పాఠశాలల పరిసరాల్లో చెత్త, మురుగు పేరుకుపోవడంపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డ్రైనేజీలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని, చెత్తను తొలగించాలని, రోడ్లను మెరుగుపరచాలని అధికారులను కోరారు.

రోడ్లపై మురుగునీరు.. గుంతల్లో ప్రయాణం
రోడ్లపై మురుగునీరు.. గుంతల్లో ప్రయాణం

More in Local