అత్యాచారం కేసు.. ఎట్టకేలకు లొంగిపోయిన సీఐ

AP: పల్నాడు జిల్లా వినుకొండ PSలో సీఐ చినమల్లయ్య లొంగిపోయారు. తనపై అత్యాచారం చేశారంటూ ఓ మహిళ ఏప్రిల్ 29న ఫిర్యాదు చేసింది. దీంతో బ్రాహ్మణపల్లిలో సీఐ చిన్న మల్లయ్యపై కేసు నమోదైంది. ఘటన తర్వాత సీఐ చిన మల్లయ్య అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ముందస్తు బెయిల్ కోసం హైకోర్టు, సుప్రీంకోర్టులను ఆశ్రయించగా, బెయిల్ పిటిషన్ను ఇరు కోర్టులు డిస్మిస్ చేశాయి. అరెస్ట్ తప్పదని భావించిన సీఐ చిన మల్లయ్య వినుకొండ పోలీస్స్టేషన్లో సరెండర్ అయ్యారు.



