పెండింగ్లో 3.9 లక్షల డ్రగ్స్ కేసులు

నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్(NDPS) చట్టం కింద దేశంలో 3.96 లక్షల కేసులు పెండింగ్లో ఉన్నాయని, ఈ కేసుల కోసం 65 ప్రత్యేక కోర్టులు మాత్రమే పని చేస్తున్నాయని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(NCB) తెలిపింది. కేసుల్ని తగ్గించేందుకు అన్ని రాష్ట్రాలు ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశించింది. 22 రాష్ట్రాలు ఇంకా ప్రత్యేక NDPS కోర్టులు ఏర్పాటు చేయలేదని, వెంటనే ఏర్పాటు చేయాలని చెప్పింది.



