ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ ర్యాలీ వీఆర్ఓ

భూమి మ్యూటేషన్ పేరుతో.. లంచం డిమాండ్ చేసిన వీఆర్ఓను ఏసీబీ పట్టేసింది. ఆత్రేయపురం మండలం ర్యాలీ వీఆర్ఓ నాగేశ్వరరావు.. 0.09 ఎకరాల భూమి మ్యూటేషన్ దరఖాస్తును ఫార్వర్డ్ చేసేందుకు లంచం డిమాండ్ చేశాడు. ఏసీబీ అధికారుల వివరణ ప్రకారం.. రూ. 16,500 లంచం స్వీకరించి షర్ట్ జేబులో పెట్టుకున్న సందర్భంలో ఆయన పట్టుబడ్డారు. లంచం మొత్తం, మ్యూటేషన్ ఫైల్ ఏసీబీ స్వాధీనం చేసుకుందని రాజమహేంద్రవరం ఏసీబీ ఎస్పీ చెప్పారు – కేసు దర్యాప్తు కొనసాగుతోంది.

