గర్భిణి మృతి..ఆరుగురు పోలీసుల సస్పెండ్

యూపీలోని ఫిరోజాబాద్లో దళిత సామాజికవర్గానికి చెందిన ఒక గర్భిణి చనిపోవడంతో ఆరుగురు పోలీసులను అధికారులు ఉద్యోగంలో నుంచి సస్పెండ్ చేశారు. దొంగతనం కేసులో ఆమె భర్తను పట్టుకోవడానికి పోలీసులు ఇంటికి వెళ్లారు. ఆ టైంలో పోలీసులు తన కడుపుపై తన్నడంతోనే గర్భిణి చనిపోయిందని బంధువులు చెప్పారు. అర్ధరాత్రే ఆమెకు పోస్ట్మార్టం చేసి అంత్యక్రియలు కూడా చేసేశారు. అయితే ఆమెను కొట్టిన పోలీసులపై హత్య కేసు పెట్టాలని డిమాండ్ చేస్తూ సమాజ్వాదీ పార్టీ నాయకుడు రామ్జీలాల్ సుమన్ పోలీస్ స్టేషన్ ముందు నిరసన చేశారు.



