పరకాల మున్సిపాలిటీ అభివృద్ధి పై ఫోకస్

TG : హనుమకొండ జిల్లాలోని పరకాల మున్సిపాలిటీ అభివృద్ధి కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని మున్సిపల్ చైర్మన్ సునీల్ కుమార్ తెలిపారు. 5వ వార్డులో పర్యటించిన ఆయన, లోకల్ పీపుల్తో మాట్లాడి వాళ్ల ప్రొబ్లెమ్స్ అడిగి తెలుసుకున్నారు. ప్రజా సమస్యలను వీలైనంత త్వరగా సాల్వ్ చేస్తామని హామీ ఇచ్చారు. ఈ ప్రోగ్రామ్లో కౌన్సిలర్ గొడుగు రజిత నాగరాజు, శానిటరీ ఇన్స్పెక్టర్ వెంకటరెడ్డి పాల్గొన్నారు.



