ఫుడ్ డెలివరీలోకి ఫ్లిప్కార్ట్

ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ త్వరలో ఫుడ్ డెలివరీ రంగంలోకి అడుగుపెట్టనుంది. ఆగస్టు 15 నుంచి బెంగళూరులో పైలట్ ప్రాజెక్ట్గా సేవలను ప్రారంభించేందుకు సంస్థ సిద్ధమవుతోంది. జొమాటో, స్విగ్గీ కన్నా తక్కువ కమిషన్తో రెస్టారెంట్లను ఆకర్షించాలనే వ్యూహంతో ఫ్లిప్కార్ట్ ముందుకొస్తోంది. ఇతర సంస్థలు 16 నుంచి 30 శాతం వరకు కమిషన్ వసూలు చేస్తుండగా, ఫ్లిప్కార్ట్ సుమారు 10 శాతం మాత్రమే వసూలు చేయాలని యోచిస్తోంది. ఇందుకోసం ప్రత్యేక ఫుడ్ డెలివరీ యాప్ను కూడా తీసుకురానుంది.



