ఓనం వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే జిఎంఆర్

TG: మినీ ఇండియాగా పేరొందిన పటాన్చెరు నియోజకవర్గం విభిన్న సంస్కృతులకు నిలయంగా మారిందని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం డివిజన్లోని ఎస్ఎన్ గార్డెన్స్లో కేరళ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఓనం వేడుకలకు ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కులమతాలకు అతీతంగా అన్ని వర్గాల పండుగలు, సంప్రదాయాలను గౌరవిస్తూ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. నియోజకవర్గంలోని ప్రతి వర్గం అభివృద్ధి, సంక్షేమానికి కృషి చేస్తున్నామని చెప్పారు.





