హైదరాబాద్ రోడ్డు ప్రమాదం: రాజ్యసభ ఎంపీ కుమారుడిపై కేసు

హైదరాబాద్లోని ఇనార్బిట్ మాల్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ రాజ్యసభ ఎంపీ, జనసేన నాయకుడు లింగమనేని రమేష్ కుమారుడు సంజుష్ ప్రయాణిస్తున్న ఆస్టన్ మార్టిన్ కారు భారతి ముఖి అనే 26 ఏళ్ల షాపింగ్ మాల్ ఉద్యోగినిని ఢీకొట్టింది. తీవ్ర గాయాలైన ఆమెను ఆసుపత్రికి తరలించగా మృతిచెందింది. మాదాపూర్ పోలీసులు వేగంగా, నిర్లక్ష్యంగా వాహనం నడిపినందుకు కేసు నమోదు చేశారు. అయితే ఇది బెయిలబుల్ నేరం కావడంతో ఇంకా ఎవరినీ అరెస్టు చేయలేదని పోలీసులు తెలిపారు.



