← Back to news

హైదరాబాద్ రోడ్డు ప్రమాదం: రాజ్యసభ ఎంపీ కుమారుడిపై కేసు

By Subhash· 21 Aug 2026· Indiatimes· Hyderabad
హైదరాబాద్ రోడ్డు ప్రమాదం: రాజ్యసభ ఎంపీ కుమారుడిపై కేసు

హైదరాబాద్‌లోని ఇనార్బిట్ మాల్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ రాజ్యసభ ఎంపీ, జనసేన నాయకుడు లింగమనేని రమేష్ కుమారుడు సంజుష్ ప్రయాణిస్తున్న ఆస్టన్ మార్టిన్ కారు భారతి ముఖి అనే 26 ఏళ్ల షాపింగ్ మాల్ ఉద్యోగినిని ఢీకొట్టింది. తీవ్ర గాయాలైన ఆమెను ఆసుపత్రికి తరలించగా మృతిచెందింది. మాదాపూర్ పోలీసులు వేగంగా, నిర్లక్ష్యంగా వాహనం నడిపినందుకు కేసు నమోదు చేశారు. అయితే ఇది బెయిలబుల్ నేరం కావడంతో ఇంకా ఎవరినీ అరెస్టు చేయలేదని పోలీసులు తెలిపారు.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 4h ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.