← Back to news

జర్నలిస్టుల అక్రిడిటేషన్‌పై కీలక సమీక్ష

By saraswathi rao· 29 Aug 2026· Ambedkar Konaseema
జర్నలిస్టుల అక్రిడిటేషన్‌పై కీలక సమీక్ష

AP: అక్రిడిటేషన్ ప్రక్రియను ప్రభుత్వ నిబంధనల ప్రకారం పూర్తిగా పారదర్శకంగా నిర్వహించాలని కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ అధికారులకు సూచించారు. కలెక్టరేట్‌లో ఆయన అధ్యక్షతన జిల్లా స్థాయి రెండో జాబితా మీడియా అక్రిడిటేషన్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అక్రిడిటేషన్ దరఖాస్తులు, ధ్రువపత్రాలు, అభ్యంతరాలు, క్రిమినల్ కేసులకు సంబంధించిన అంశాలపై సమీక్షించారు. ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం ప్రతి దరఖాస్తుదారుడి అర్హతలను క్షుణ్ణంగా పరిశీలించాలని కలెక్టర్ ఆదేశించారు.

More in Local