ఎలక్ట్రిక్ బస్సులో మంటలు.. క్షణాల్లోనే దగ్ధం
TG: కరీంనగర్ డిపోకు చెందిన RTC ఎలక్ట్రిక్ బస్సు ఆదివారం ఉదయం కరీంనగర్ నుంచి హైదరాబాద్కు 41 మంది ప్రయాణికులతో బయల్దేరింది. తిమ్మాపూర్ మండలం అలుగునూరు సమీపంలోకి రాగానే ఒక్కసారిగా బస్సులో నుంచి మంటలు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన డ్రైవర్, బస్సులో ఉన్న 41 మంది ప్రయాణికులను కిందకు దించేశాడు. క్షణాల్లోనే బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. పెను ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.



