← Back to news

చెరువులో అక్రమంగా మట్టి తవ్వకాలు

By SARDHAR· 23 Aug 2026· Kaligiri

AP : నెల్లూరు జిల్లా కలిగిరి పెద్ద చెరువులో మట్టి మాఫియా విచ్చలవిడిగా తోడేస్తోంది. అధికారుల సహకారంతోనే హిటాచీలు, టిప్పర్లు, ట్రాక్టర్లు పెట్టి రోజూ టన్నుల కొద్దీ మట్టిని అమ్ముకుంటూ లక్షలు సంపాదిస్తున్నారు. పొలం పనుల పేరుతో పర్మిషన్ తెచ్చుకుని, బయట వ్యాపారాలకు మట్టిని అమ్ముతున్నా ఎవరూ పట్టించుకోవట్లేదు. చెరువును లోతుగా తవ్వేస్తుండటంతో అది పెద్ద గోతిలా మారిపోయింది. దీనివల్ల పశువులకి, జనాలకి ప్రమాదం వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ అక్రమ తవ్వకాలను ఆపాలని ఊరి జనం కోరుతున్నారు.

More in Local