కారులో గంజాయి కలకలం.. ఇద్దరు అరెస్ట్

AP: రాజానగరం పోలీస్ స్టేషన్ పరిధిలో 25.970 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సీలేరు నుంచి విజయవాడ వెళ్తున్న కారులో మూడు పాలిథిన్ సంచుల్లో గంజాయిని గుర్తించారు. దీని వాల్యూ రూ.4.29 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం సారిపల్లెకు చెందిన సుజీవ్కుమార్, నరేష్ను అరెస్ట్ చేశారు. వారి నుంచి కారు, రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి తీసుకునే వ్యక్తితో పాటు సీలేరు సమీపంలోని సప్లయర్ కోసం పోలీసులు వెతుకుతున్నారు. కేసు బుక్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.



