ఇవాళ ‘రంగులూ, ఫిరంగులూ’ పుస్తకావిష్కరణ

TG: ప్రముఖ రచయిత దివంగత రాచకొండ విశ్వనాథ శాస్త్రి(రావిశాస్త్రి) రచనల్లోని కీలక వాక్యాలను , గుర్తుంచుకోదగిన పేరాలను, వ్యంగాత్మక సంభాషణలను, విషాద దృశ్యాలను సేకరించి ‘రంగులూ, ఫిరంగులూ’ పేరుతో 350 పేజీల పుస్తకంగా తీసుకొస్తున్నారు. ఇవాళ సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ నగరంలోని బషీర్బాగ్ ప్రెస్క్లబ్లో ఈ పుస్తకాన్ని ఆవిష్కరించనున్నారు. రచయితలు ఎం.ఎస్.నాయుడు, మృణాళిని, జి.ఎస్.చలం తదితరులు పాల్గొంటారు.



