బహుజనుల రాజ్యంతోనే ప్రజల అభివృద్ధి: డాక్టర్ కదిరి కృష్ణ

TG : తెలంగాణలో బహుజనుల రాజ్యం వస్తేనే ప్రజల జీవితాలు బాగుపడతాయని బహుజన సేన వ్యవస్థాపకులు డాక్టర్ కదిరి కృష్ణ అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని పెన్షనర్స్ భవనంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఎక్కువగా ఉన్న BC,SC,ST శ్రామిక వర్గాలకు సరైన వాటా, అధికారాలు దక్కాలని కోరారు. ఇప్పటిదాకా పాలకులు బహుజనులను మోసం చేశారని, ప్రజల తరఫున బహుజన సేన ఎప్పుడూ పోరాడుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాజేష్, చంద్రశేఖర్, నారాయణ పాల్గొన్నారు.




