ఒలెక్ట్రా గ్రాండ్ మైలురాయి: 4,000 చేరుకున్న ఎలక్ట్రిక్ బస్సు

భారతీయ ఎలక్ట్రిక్ వాహన రంగంలో ఒలెక్ట్రా గ్రీన్టెక్ లిమిటెడ్ (OGL) చారిత్రాత్మక మైలురాయిని అధిగమించింది. వివిధ రాష్ట్రాల రోడ్డు రవాణా సంస్థలకు అందించిన ఎలక్ట్రిక్-బస్సుల సంఖ్య 4,000కు చేరింది. హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్కు 4,000వ బస్సును అందజేయడంతో ఈ ఘనత సాధ్యమైంది. హెచ్ఆర్టీసీకి ఒలెక్ట్రా మొత్తం 297 బస్సులను సరఫరా చేసింది.ఈ 4,000 ఎలక్ట్రిక్ బస్సులు ఇప్పటివరకు 73 కోట్ల కిలోమీటర్లు ప్రయాణించి, 6.5 లక్షల టన్నుల కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను తగ్గించింది.



