కొండగట్టు గుట్టపై సెల్ టవర్..!

జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టు అంజన్న ఆలయానికి వచ్చే భక్తులకు సెల్ సిగ్నల్ సమస్య ఉంది. భక్తులు, అధికారులు పలుమార్లు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం దృష్టికి తీసుకెళ్లారు. ఆయన ఇండస్ సెల్ టవర్ సంస్థతో మాట్లాడి టవర్ ఏర్పాటుకు చొరవ తీసుకున్నారు. ఇప్పటికే టవర్ ఏర్పాటు పూర్తయ్యింది. రేపు ఎమ్మెల్యే ప్రారంభించనున్నారు. దీంతో కొండపై భక్తులకు మొబైల్ సేవలు అందుబాటులోకి రానున్నాయి.



