← Back to news

అదనపు కట్నం వేధింపులతో వివాహిత ఆత్మహత్య

By A VIJAY KUMAR· 2d ago· Hanumakonda
అదనపు కట్నం వేధింపులతో వివాహిత ఆత్మహత్య

TG: హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలంలో అదనపు కట్నం వేధింపులతో ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం లింగగిరికి చెందిన అఖిల(24)కు ప్రవీణ్‌రెడ్డితో 2022లో వివాహమైంది. రూ.50 వేల అదనపు కట్నం కోసం భర్త, అత్తింటివారు వేధించేవారని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ విషయమై తరచూ దంపతుల మధ్య గొడవలు జరిగేవని పోలీసులు తెలిపారు. రాత్రి కూడా దంపతుల మధ్య వివాదం జరగగా, అఖిల ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుందని, ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

More in Local

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో
Local· 9h ago

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో

TG: కరెంట్ కోతలతో విసిగిపోయిన మహబూబాబాద్ జిల్లా మునిగలవీడు గ్రామస్తులు చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో చేపట్టారు. శుక్రవారం రాత్రి మహబూబాబాద్–తొర్రూరు రహదారిపై విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించడంతో వాహనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వం కరెంట్ కోతలు లేవని చెబుతున్నా రోజులో పలుమార్లు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. సాయంత్రం, రాత్రి వేళల్లో కోతలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అధికారులతో మాట్లాడి విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.