మదర్ థెరిసా సేవలు అందరికీ స్ఫూర్తిదాయకం

AP: సేవా మార్గంలో ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన మదర్ థెరిసా జయంతి వేడుకలను గుత్తి పెన్షనర్స్ భవనంలో ఘనంగా నిర్వహించారు. అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని పెన్షనర్స్ భవనంలో అసోసియేట్ ప్రెసిడెంట్ స్వర్ణాంబ, కోశాధికారి జెన్నే కుల్లాయిబాబు ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. తొలుత మదర్ థెరిసా చిత్రపటానికి కోశాధికారి జెన్నే కుల్లాయిబాబు, సెక్రటరీ రామ్మోహన్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. పేదలు, ఆకలితో అలమటించే వారు, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి మదర్ థెరిసా అందించిన సేవలను గుర్తుచేశారు.


