← Back to news

ఆ 'శక్తి' మాకొద్దు.... విద్యార్థుల ధర్నా

By Praveen· 24 Aug 2026
ఆ 'శక్తి' మాకొద్దు.... విద్యార్థుల ధర్నా

జయశంకర్ భూపాలపల్లి కలెక్టర్ ఆఫీస్ ముందు పాలిటెక్నిక్ విద్యార్థులు ధర్నాకు దిగారు. శక్తి స్కీమ్ పేరుతో పాలిటెక్నిక్ విద్యను స్కిల్ యూనివర్సిటీలో విలీనం చేస్తూ వచ్చిన G.O. 97ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. విలీనం వల్ల B.Techలో లాటరల్ ఎంట్రీ (ECET) దెబ్బతింటుందని, ఫీజులు పెరుగుతాయని, డిప్లొమా విలువ తగ్గుతుందని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. PPP మోడల్లో నడిచే YISU ఫీజులు పెంచే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. ఇది పాలిటెక్నిక్ విద్యను ‘జనరల్ లేబర్ ట్రైనింగ్’గా మారుస్తుందని ఆందోళన.

More in Local