‘అపురూప’ - కథల పుస్తకం

ఉద్యమ కుటుంబాల్లోని అన్నాచెల్లెళ్లు, భార్యాభర్తలు, బంధువుల మధ్య ఉండే అనుబంధాలను చిత్రిస్తూ పద్మకుమారి రాసిన కథల పుస్తకం ఈ ‘అపురూప’. రాజ్యహింసను ఎదుర్కొంటూ అమరులైన వారి కుటుంబాల వేదనను రచయిత్రి ఎంతో సంవేదనతో రాశారు. మానవ సంబంధాల ఆత్మీయతను, పోరాట స్ఫూర్తిని కళ్లకు కట్టేలా సహజమైన శైలిలో ఈ కథలు ఉంటాయి. ఈ పుస్తకాన్ని విరసం(విప్లవ రచయితల సంఘం) ప్రచురించింది. ధర రూ.150. వివరాలకు: 9989189250.



