← Back to news

మోదీ భయపడ్డారు.. ఆ భయం స్పష్టంగా కన్పిస్తుంది

By DK· 24 Jul 2026
మోదీ భయపడ్డారు.. ఆ భయం స్పష్టంగా కన్పిస్తుంది

నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసనలు కొనసాగుతున్నాయి. దీనిపై ప్రధాని మోదీ సోషల్ మీడియాలో విడుదల చేసిన వీడియోపై నటుడు ప్రకాష్ రాజ్ స్పందించారు. పేపర్ లీకేజీలపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రధాని ప్రకటించగా, దానిని రీట్వీట్ చేసిన ప్రకాష్ రాజ్ "డర్ గయా.. ఆయనలో భయం కనిపిస్తోంది" అంటూ ఎద్దేవా చేశారు. దేశవ్యాప్తంగా యువత, విద్యార్థులు చేసిన పోరాటం వల్లే కేంద్ర ప్రభుత్వం స్పందించాల్సి వచ్చిందని అన్నారు. యువత ఐక్యతే ప్రభుత్వాన్ని నిర్ణయాలు మార్చేలా చేసిందని పేర్కొన్నారు.

More in India