← Back to news

పాడేరు ITDA గేటు వద్దే విద్యార్థుల నిద్ర, నిరసన

By B Dev Poddu· 27 Aug 2026· అల్లూరిసీతారామరాజు జిల్లా

AP: పాఠశాల నుంచి తమను బలవంతంగా పంపించడాన్ని నిరసిస్తూ గిరిజన విద్యార్థులు, తల్లిదండ్రులు పాడేరు ITDA గేటు వద్ద నిద్రిస్తూ ఆందోళన చేపట్టారు. విశాఖపట్నంలోని మారికవలస గురుకులం స్కూల్‌ ఆఫ్‌ ఎక్సలెన్సీలో 5, 6, 7, 8 తరగతులు చదువుతున్న 480 మంది గిరిజన విద్యార్థులను పాఠశాల నుంచి పంపించారని తల్లిదండ్రులు ఆరోపించారు. సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్సీ ప్రారంభిస్తామంటూ విద్యార్థులు, తల్లిదండ్రులకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా పోలీసుల సమక్షంలో విద్యార్థులను బయటకు పంపించడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.

More in Local