పాడేరు ITDA గేటు వద్దే విద్యార్థుల నిద్ర, నిరసన
AP: పాఠశాల నుంచి తమను బలవంతంగా పంపించడాన్ని నిరసిస్తూ గిరిజన విద్యార్థులు, తల్లిదండ్రులు పాడేరు ITDA గేటు వద్ద నిద్రిస్తూ ఆందోళన చేపట్టారు. విశాఖపట్నంలోని మారికవలస గురుకులం స్కూల్ ఆఫ్ ఎక్సలెన్సీలో 5, 6, 7, 8 తరగతులు చదువుతున్న 480 మంది గిరిజన విద్యార్థులను పాఠశాల నుంచి పంపించారని తల్లిదండ్రులు ఆరోపించారు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ ప్రారంభిస్తామంటూ విద్యార్థులు, తల్లిదండ్రులకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా పోలీసుల సమక్షంలో విద్యార్థులను బయటకు పంపించడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.


