ఉప్పు సత్యాగ్రహంతో ‘చలో సంసద్’ను పోల్చిన ప్రకాశ్రాజ్

దిల్లీలో మొన్న జరిగిన ‘చలో సంసద్’ నిరసనకారులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడాన్ని ప్రస్తావిస్తూ 'ఇది గతంలోనూ జరిగింది. మళ్ళీ జరుగుతుంది. ఈ ప్రభుత్వ క్రూరత్వాన్ని కూడా యువత అధిగమిస్తుంది' అని తన ‘ఎక్స్’లో రాశారు నటుడు, సామాజిక కార్యకర్త ప్రకాశ్రాజ్. 1930 ఉప్పు సత్యాగ్రహ వీడియోతో 2026 దిల్లీ యువత నిరసనలను పోల్చారు.



