← Back to news

స్కెచ్ వేసి చివరికి బుక్కయ్యాడు

By DK· 1 Aug 2026· కరీంనగర్ జిల్లా
స్కెచ్ వేసి చివరికి బుక్కయ్యాడు

TG: కరీంనగర్‌లో భూవివాదంలో ప్రత్యర్థిని <a href="https://www.theclearcutnews.com/n/5YvSyTa">ఇరికించేందుకు</a> గంజాయి కేసు సృష్టించిన ఈగల్ టీమ్ కానిస్టేబుల్ నాగరాజును కొత్తపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. భూతగాదాలో ఉన్న వ్యక్తిపై కేసు నమోదు చేయించేందుకు వరంగల్ నుంచి గంజాయి తెప్పించి అతడి దుకాణంలో ఉంచినట్లు తెలిపారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చి కేసు పెట్టించే ప్రయత్నం చేసినట్లు వెల్లడించారు. మిగిలిన 370 గ్రాముల గంజాయిని దాచిపెట్టినట్లు విచారణలో తేలింది. గంజాయి, 4 ఫోన్లను స్వాధీనం చేసుకుని నాగరాజును అదుపులోకి తీసుకున్నట్లు ACP విజయ్‌కుమార్ తెలిపారు.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 10h ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.