← Back to news

డూప్లెక్స్‌ ఇంట్లో మహిళ అస్థిపంజరం

By Mahesh· 8 Aug 2026· బెంగళూరు
డూప్లెక్స్‌ ఇంట్లో మహిళ అస్థిపంజరం

బెంగళూరులోని బగలగుంటె హవనూర్‌ లేఅవుట్‌లో ఓ డూప్లెక్స్‌ ఇంట్లో మహిళ (దాక్షాయిణి) అస్థిపంజరం లభ్యమైంది. ఆమె సంవత్సరం క్రితమే చనిపోయుండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. భర్త ఉమేశ్‌ 10 ఏళ్ల క్రితం మృతి చెందగా, కుమారుడు కూడా క్యాన్సర్‌తో చనిపోయినట్లు తెలుస్తోంది. దీంతో ఆమె ఒంటరిగా ఉంటూ డిప్రెషన్‌తో బాధపడుతున్నట్లు పోలీసులు తెలిపారు. సంవత్సరం నుంచి ఆమె కూతురు, అల్లుడు కూడా ఇంటికి రాలేదని తెలుస్తోంది. బగలగుంటె పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతికి గల కారణాలుపై దర్యాప్తు చేస్తున్నారు.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 7h ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.