డూప్లెక్స్ ఇంట్లో మహిళ అస్థిపంజరం

బెంగళూరులోని బగలగుంటె హవనూర్ లేఅవుట్లో ఓ డూప్లెక్స్ ఇంట్లో మహిళ (దాక్షాయిణి) అస్థిపంజరం లభ్యమైంది. ఆమె సంవత్సరం క్రితమే చనిపోయుండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. భర్త ఉమేశ్ 10 ఏళ్ల క్రితం మృతి చెందగా, కుమారుడు కూడా క్యాన్సర్తో చనిపోయినట్లు తెలుస్తోంది. దీంతో ఆమె ఒంటరిగా ఉంటూ డిప్రెషన్తో బాధపడుతున్నట్లు పోలీసులు తెలిపారు. సంవత్సరం నుంచి ఆమె కూతురు, అల్లుడు కూడా ఇంటికి రాలేదని తెలుస్తోంది. బగలగుంటె పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతికి గల కారణాలుపై దర్యాప్తు చేస్తున్నారు.



