← Back to news

అంగన్వాడీల మెరుపు ధర్నా.. కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత

By DK· 10 Jul 2026· తిరుపతి జిల్లా
అంగన్వాడీల మెరుపు ధర్నా.. కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత

AP: దీర్ఘకాలికంగా ఉన్న తమ సమస్యలు పరిష్కరించాలని అంగన్వాడీ కార్యకర్తలు మెరుపు ధర్నాకు దిగడంతో తిరుపతి కలెక్టరేట్ వద్ద టెన్షన్ వాతావరణం నెలకుంది. ESI, PF సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. CITU ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ప్రభుత్వం వెంటనే అంగన్వాడీ వర్కర్లకు రూ.26 వేల కనీస వేతనం ఇవ్వాలన్నారు. అంగన్వాడీలు సుదీర్ఘకాలంగా సేవలు అందిస్తున్నా, వారి సామాజిక భద్రతను ప్రభుత్వం విస్మరిస్తోందన్నారు. వెంటనే వారి డిమాండ్లను నెరవేర్చాలని కోరారు. ప్రభుత్వం స్పందించి సానుకూల నిర్ణయం తీసుకునే వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు.

More in AP