ప్రతి దరఖాస్తును సకాలంలో పరిష్కరించాలి: కలెక్టర్

TG: ప్రజల సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దని అధికారులకు కలెక్టర్ సత్యప్రసాద్ ఆదేశించారు. జగిత్యాల రూరల్ మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి వినతులు, ఫిర్యాదులు స్వీకరిస్తున్న తీరును పరిశీలించారు. దరఖాస్తుదారుల సమస్యలను అధికారులు బాధ్యతగా నమోదు చేసుకుని, ప్రతి వినతిని సకాలంలో పరిష్కరించాలని సూచించారు. ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి లేకుండా సమస్యలకు వేగంగా పరిష్కారం చూపాలన్నారు.




