ఆలయ సిబ్బందిని అయోధ్య వీడి వెళ్లొద్దని సిట్ ఆదేశాలు

అయోధ్య రామాలయంలో రూ.200 కోట్ల భక్తుల విరాళాల మాయం కేసులో ఆలయ సిబ్బంది అయోధ్యను వీడి వెళ్లరాదని సిట్ కీలక ఆదేశాలు జారీ చేసింది.ట్రస్ట్ అధికారులు, ఇతర సిబ్బందిని విచారించిన నివేదికను డిజిటల్ రూపంలో భద్రపరుస్తున్నందున ఎవరూ నగరం దాటి వెళ్లొద్దంది. రోజు వారీ నివేదికను సీఎం కార్యాలయానికి కూడా పంపుతున్నారు. ఆలయంలో నిఘా వ్యవస్థను,భద్రతా ఏర్పాట్లను కూడా పరిశీలించారు. ఆలయ సిబ్బంది ఇచ్చిన వాంగ్మూలాలలో భిన్న కథనాలు వినిపిస్తున్నాయి.



