బీహార్ నిరసనల్లో పోలీసు సస్పెండ్
నీట్ పేపర్ లీక్ పై జూలై 25న సివాన్ జిల్లాలో 'బీహార్ బంద్' జరిగింది. ఆ సమయంలో స్టూడెంట్స్ పై ఓ పోలీసు ఏకే-47 తో ఫైరింగ్ చేసిన వీడియో వైరల్ అయింది. వెంటనే ఉన్నతాధికారులు అతడిని సస్పెండ్ చేశారు. ఈ గొడవల్లో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. వీరిలో ఆరిఫ్ అనే 15ఏళ్ల కుర్రాడి మెడకి బుల్లెట్ తాకింది. డాక్టర్లు ఆపరేషన్ చేసి దాన్ని బయటకు తీశారు. ప్రస్తుతం గాయపడిన వాళ్లంతా సేఫ్ గానే ఉన్నారు. ఈ ఘటనపై ఎంక్వయిరీ చేస్తున్నామని, రూల్స్ పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్పారు.



