ఉస్మానియా మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం

TG: హైదరాబాద్ కోఠి ఉస్మానియా మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ ఘటన తీవ్ర కలకలం రేపింది. BDS (బ్యాచిలర్ ఆఫ్ డెంటల్ సర్జరీ) మొదటి సంవత్సరం విద్యార్థులను ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ర్యాగింగ్ చేశారని కేసు నమోదైంది. ఉస్మానియా మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ సంజీవ్ సింగ్ యాదవ్ ఫిర్యాదుతో 12మంది ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్పై సుల్తాన్ బజార్ పోలీసులు కేసు నమోదు చేశారు. ర్యాగింగ్ చేసిన 12 మంది విద్యార్థులను ప్రిన్సిపల్ సస్పెండ్ చేశారు.



