గోదావరిఖనిలో కరెంటు బంద్!

గోదావరిఖని లక్ష్మీ నగర్, రాహుల్ హాస్పిటల్, పాత పంచాయతీ ఆఫీసు ప్రాంతాల్లో సోమవారం ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 వరకు కరెంటు ఆగిపోతుంది. కారణం – మరమ్మత్తు పనులు. ట్రాన్స్కో ఈస్ట్ ఏఈ జమిల్ పాషా ఇదే విషయం క్లియర్ చేశారు. ఇంట్లో ల్యాప్టాప్స్, ఫోన్స్, ఇన్వర్టర్స్ బ్యాకప్ ఇప్పుడే చేసుకోండి.. లేదంటే 6 గంటల పాటు 'నో చార్జ్' టెన్షన్ మూడుతుంది. అధికారులు వినియోగదారుల సహకారం కోరుతున్నారు. ఈ సమయంలో ఆఫ్లైన్ పనులు పూర్తి చేసేసుకోవడమే స్మార్ట్ ట్రిక్!



