పేద విద్యార్థులకు అంబేద్కర్ గురుకులం అండ

AP: తాడికొండలో ప్రారంభమైన డా.బి.ఆర్.అంబేద్కర్ గురుకులం–సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కాలేజీ పేద, సామాజికంగా వెనుకబడిన విద్యార్థులకు ఉన్నత విద్యకు బాటలు వేయనుంది. విద్యార్థులు క్రమశిక్షణ, పట్టుదలతో చదివి ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్కుమార్ సూచించారు. నాణ్యమైన విద్యతోపాటు మెరుగైన మౌలిక వసతులు, ఉన్నత విద్యా అవకాశాలు అందుబాటులోకి రావడంతో ప్రతిభ ఉన్న నిరుపేద విద్యార్థులకు ఉపయోగకరంగా మారనుందన్నారు.



