దూడల్ని బలి తీసుకున్న కుక్కలు.. లైట్లు లేవు!

పల్నాడు నకరికల్లు గుండ్లపల్లిలో వీధి కుక్కల బెడద తారాస్థాయికి చేరింది. కుమ్మరి బజార్లో కుక్కలు దూడలపై దాడి చేయడంతో 2 దూడలు మృతి చెందాయి. గత నెల రోజులుగా వీధి లైట్లు పనిచేయకపోవడంతో రాత్రివేళల్లో శునకాల సంచారం పెరిగిందని, ప్రజలు, పశువులు ప్రమాదంలో పడుతున్నారని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గుండ్లపల్లి మాత్రమే కాదు మొత్తం ఏపీలోలోనే కుక్క కాటు కేసులు భయంకరంగా పెరుగుతున్నాయి. 2024లో రాష్ట్ర వ్యాప్తంగా 2,44,914 కేసులు నమోదైతే, గుంటూరులో 18,040, బాపట్లలో 8,742, పల్నాడులో 4,186 నమోదయ్యాయి.

