తప్పుడు లెక్కలు సృష్టించి.. 3.61 కోట్లు స్వాహా

AP: అనంతపురం జిల్లాలో నిర్వహించిన ఉపాధి హామీ పనుల్లో అక్రమాలు జరిగాయి. జిల్లాలోని 31 మండలాల పరిధిలో చేయని పనులకు బిల్లులు చెల్లించడం, తప్పుడు పేర్లు నమోదు చేయడం, పనికి రాకున్నా మరొకరి పేర్లతో కూలి వేతనాలు చెల్లించడం, వంటి అనేక రూపాల్లో నిధుల దుర్వినియోగం జరిగినట్లు అధికారులు గుర్తించారు. గత ఏడాది జరిగిన ఉపాధి పనుల్లో రూ. 3.61 కోట్ల నిధులు దుర్వినియోగమైనట్లు అధికారులు గుర్తించారు. ఫీల్డ్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్ తదితరులు అక్రమాలకు పాల్పడిన వారిలో ఉన్నారు. రికవరీ కోసం విజిలెన్స్ అధికారులు చర్యలు చేపట్టారు.



