← Back to news

2029లో ఓటింగ్ పవర్ Gen Z చేతుల్లోకి..?

By Nani· 3 Aug 2026· Ndtv
2029లో ఓటింగ్ పవర్ Gen Z చేతుల్లోకి..?

2029 Electionsలో అసలు Game Changers Gen Zనేనా..? 👀 ఇండియాలో 2029 లోక్‌సభ ఎన్నికల టైమ్‌కి జెన్ జీ దేశంలోనే అతిపెద్ద అడల్ట్ జనరేషన్‌గా మారనుందని అంచనాలు చెబుతున్నాయి. 18–32 ఏళ్ల మధ్య ఉన్న జెన్ జీ జనాభా దాదాపు 38 కోట్లు ఉండొచ్చని, ఇది 2029లో ఓటు వేయడానికి అర్హులైన వారిలో దాదాపు నలుగురిలో ఒకరికి సమానమని NDTV తెలిపింది. అదే సమయంలో మిలీనియల్స్ సుమారు 35.7 కోట్లు ఉండొచ్చని అంచనా. అంటే 2029లో జాబ్స్, ఎడ్యుకేషన్, ఏఐ, డిజిటల్ రైట్స్ లాంటి యూత్ ఇష్యూస్ పొలిటికల్ పార్టీలకు మరింత ఇంపార్టెంట్ కావచ్చు.

More in Politics