ఇల్లు పోయినా ఇబ్బంది లేకుండా.. TIDCO ఇళ్లు

AP తూర్పు గోదావరి జిల్లా మండపేటలో పెద్ద కాలువ దగ్గర ఆక్రమణల తొలగింపులో ఇళ్లు కోల్పోయిన పేద కుటుంబాలకు మున్సిపల్ అధికారులు టిడ్కో, రాజీవ్ గృహకల్ప కాలనీల్లో ఇళ్లు ఇచ్చి పునరావాసం కల్పించారు. ఆదివారం ఇళ్లను ఖాళీ చేయించిన వెంటనే వారికి కేటాయించిన ఫ్లాట్లకు తరలించారు. సోమవారం మున్సిపల్ కమిషనర్ టీవీ రంగారావు ఆ కాలనీలను సందర్శించి ప్రజలతో మాట్లాడారు. నిర్వాసితులకు ఎలాంటి కష్టం రాకుండా తాగునీరు, కరెంట్, పారిశుద్ధ్యం లాంటి సౌకర్యాలు వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.



