ముద్రగడ కుమార్తెను అడ్డుకున్న పోలీసులు.. ఉద్రిక్తత
AP: కాపు ఉద్యమనేత, ప్రముఖ రాజకీయవేత్త ముద్రగడ పద్మనాభరెడ్డి భౌతికకాయం కాకినాడ జిల్లాలోని స్వగ్రామం కిర్లంపూడికి చేరుకోవడంతో ఆయన అభిమానులు, అనుచరులు భారీగా తరలివచ్చారు. చివరిచూపు చూసేందుకు వచ్చిన ఆయన కుమార్తె క్రాంతి శీలను పోలీసులు అడ్డుకున్నారు. ఆమె కిర్లంపూడి రావడానికి వీల్లేదని కుటుంబసభ్యులు సూచించడంతో ప్రత్తిపాడు వద్దే క్రాంతి కార్లను నిలిపివేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకుంది. ఎట్టకేలకు క్రాంతి కిర్లంపూడికి చేరుకోగా, ఆమెను ముద్రగడ అభిమానులు, అనుచరులు మళ్లీ అడ్డుకున్నారు.



