అమెరికాలో తెలుగు యువకుడు మృతి

AP: విజయవాడకు చెందిన గడ్డం మణిచంద్ర తేజ (28) అమెరికాలో మృతి చెందాడు. హైదరాబాద్లోని ఇక్ఫాయ్ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ పూర్తి చేసిన చంద్రతేజ 2022లో ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాడు. నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీలో కోర్సు పూర్తయిన అనంతరం బోస్టన్లోని ఓ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. మసాచుసెట్స్ రాష్ట్రంలోని ఆరెంజ్ నగరంలో స్కైడైవింగ్ కోసం వెళ్లారు. గాల్లో ఎగిరిన తర్వాత పారాచూట్ కిందకు దిగే సమయంలో గాలి తీవ్రంగా వీయడంతో 30 అడుగుల ఎత్తు నుంచి కింద పడ్డాడు. తీవ్ర గాయాలైన అతడిని హాస్పిటల్కు తరలించేలోగా చనిపోయాడు.



