హౌస్కీపింగ్ సిబ్బందిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలి

AP: విశాఖ విమానాశ్రయంలో ఉద్యోగాలు కోల్పోయిన హౌస్కీపింగ్ కార్మికుల ఆందోళనకు వైఎస్సార్సీపీ మద్దతు తెలిపింది. సిబ్బందిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కె.కె. రాజు డిమాండ్ చేశారు. ఆరు రోజులుగా విమానాశ్రయం వద్ద కార్మికులు చేస్తున్న నిరసనకు ఆయన సంఘీభావం తెలిపారు. కూటమి ప్రభుత్వం కార్మికుల సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఉద్యోగాలు కోల్పోయిన హౌస్కీపింగ్ సిబ్బందికి న్యాయం చేయాలని కోరారు.




