పండుగ ఆనందం క్షణాల్లో విషాదం

AP: అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అనకాపల్లి జిల్లా గుర్రాలపాలెం గ్రామస్థులు పాడేరు అమ్మవారి పాదాల వద్ద పండుగ చేసుకుని తిరిగి వస్తుండగా, పాడేరు ఘాట్ రోడ్డులోని కోమలమ్మ పనుకు మలుపు వద్ద బొలెరో వ్యాన్ బ్రేకులు ఫెయిలై బోల్తా పడింది. ప్రమాదంలో దివి చలపతిరావు స్పాట్లోనే మృతి చెందగా, సూరిశెట్టి అప్పారావు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. మరో పది మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించిన పోలీసులు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.



