← Back to news

📝 చిలమత్తూరులో రైతుల ధర్నా

By nagendra· 25 Aug 2026· Chilamathur
📝 చిలమత్తూరులో రైతుల ధర్నా

AP : శ్రీ సత్యసాయి జిల్లా చిలమత్తూరు సబ్‌ రిజిస్ట్రార్ ఆఫీస్ ముందు చాగలేరు పంచాయతీ రైతులు నిరసనకు దిగారు. స్లాట్ బుక్ చేసుకుని, పేపర్స్ అన్నీ కరెక్ట్‌గా ఉన్నా రెండు వారాలుగా భూముల రిజిస్ట్రేషన్ చేయకుండా తిప్పుకుంటున్నారని మండిపడ్డారు. రైతుల ఆందోళనతో ఆఫీస్ పనులకు డిస్టబెన్స్ కలగగా, సబ్‌ రిజిస్ట్రార్ అక్కడి నుంచి వెళ్ళిపోయినట్లు రైతులు చెప్పారు. పొలిటికల్ ప్రెజర్ వల్లే పనులు ఆపేశారని, క్లియర్ రీజన్ చెప్పి వెంటనే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పూర్తి చేయాలని వారు డిమాండ్ చేశారు.

More in Local

మైల్వార్‌లో రేకుల షెడ్డు ధ్వంసం.. పోలీసులకు ఫిర్యాదు
Local· 23m ago

మైల్వార్‌లో రేకుల షెడ్డు ధ్వంసం.. పోలీసులకు ఫిర్యాదు

TG: వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం మైల్వార్ గ్రామంలో ఆన్‌లైన్ సెంటర్ కోసం నిర్మించిన రేకుల షెడ్డు ధ్వంసం కావడం వివాదానికి దారితీసింది. గ్రామానికి చెందిన ఉప్పర్ నగేష్ పాఠశాల ఎదుట ఆన్‌లైన్ సెంటర్ ఏర్పాటుకు రేకుల షెడ్డు నిర్మించారు. పంచాయతీ అనుమతులు లేవంటూ అదే గ్రామానికి చెందిన ఇబ్రహీం అభ్యంతరం వ్యక్తంచేసి కర్రతో షెడ్డు ధ్వంసం చేసినట్లు నగేష్ ఆరోపించారు. నిర్మాణానికి అనుమతి కోరుతూ పంచాయతీ కార్యదర్శికి వినతిపత్రం ఇచ్చినట్లు తెలిపారు. ఇబ్రహీంపై చర్యలు తీసుకోవాలని బషీరాబాద్ PSలో ఫిర్యాదు చేశారు.