బస్సు, ఆటో ఢీకొని 15 ఏళ్ల స్టూడెంట్ స్పాట్ డెడ్: మహబూబ్నగర్
మహబూబ్నగర్ జిల్లా చిన్నదరపల్లి దగ్గర ఒక ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పరిగి డిపోకు చెందిన బస్సు, ఒక ఆటోను బలంగా ఢీకొట్టింది. ఈ యాక్సిడెంట్లో ఆటోలో ఉన్న సంపంగి చరణ్ (15) అనే స్టూడెంట్ అక్కడికక్కడే చనిపోయాడు. పెద్ద దరపల్లికి చెందిన ఆటో డ్రైవర్ రామ్ ఆంజనేయులుతో పాటు ఆటోలో ఉన్న మిగతా పిల్లలకు చిన్న చిన్న గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే గాయపడిన వారిని ట్రీట్మెంట్ కోసం జిల్లా గవర్నమెంట్ హాస్పిటల్కి తరలించారు. ఈ ఘటనతో ఆ ఏరియాలో తీవ్ర విషాదం నెలకొంది.



